ప్రస్తుతం మీ దగ్గర భూమి ఉండి ఏ పంట వేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు నడిపించే ఏకైక పంట మిరియాల పంట అని చెప్పవచ్చు. నల్ల మిరియాలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉంది. ఒక ఎకరం భూమిలో నల్ల మిరియాల సాగు చేసారు అంటే కచ్చితంగా మీరు ఊహించని స్థాయిలో ఆదాయాన్ని పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా మిరియాల ఉత్పత్తిలో మన భారతదేశం 54 శాతం మిరియాలను ఉత్పత్తి చేస్తోంది. కేరళ, బెంగాల్ , పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక , తమిళనాడు , కొంకన్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రపంచ దేశాలలో కూడా మిరియాలకు మంచి డిమాండ్ ఉండడంతో వీటి ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.

అందుకే వాటిని నల్ల బంగారం అని కూడా తెలుస్తూ ఉంటారు ఇండియాలో 90 శాతం మంది  కేరళ వాసులు మిరియాలను ఉత్పత్తి చేస్తున్నారు. మిరియాల ధర ఎక్కువగా ఉండడానికి గల కారణం సాగు ఎక్కువ కాలం పట్టడమే అందుకే మిరియాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మిరియాల చెట్లకు పువ్వులు వచ్చిన ఆరు నెలల తర్వాత మిరియాలు వస్తాయి.. కాబట్టి ఈ సాగు చేపట్టినట్లయితే రైతులకు మంచి లాభాలు వస్తాయి నిజానికి మోస్ట్ పాపులర్ కరిముంద మిరియాలను కేరళలో సాగు చేస్తున్నారు. పన్నియుర్ 1 అనే జాతి మిరియాల సాగు చేపడితే ఎకరానికి 500 కేజీల మిరియాల దిగుబడి మీరు పొందవచ్చు. ఒకవేళ పన్నియూర్ 2 జాతి మిరియాలు సాగు చేసినట్లయితే ఎకరాకి 1100 కేజీలు వస్తాయి . ఇలా ఒక్కో జాతిని బట్టి వీటి దిగుబడి మారుతూ ఉంటుంది.

మిరియాల పంటకు వేడి వాతావరణం అవసరం.. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలు బాగా సెట్ అవుతాయి.. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.  కాబట్టి పూలు త్వరగా వస్తాయి. పది అడుగుల ఎత్తు పెరుగుతూనే దిగుబడిని ఇస్తాయి. కాబట్టి ఒక్కసారి మొక్కలు వేశారంటే ఎనిమిది సంవత్సరాల పాటు మీరు లాభాన్ని పొందవచ్చు అయితే ఈ వ్యాపారం చేయాలంటే రైతులకు కాస్త సహనం ఉంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: