ఈటీవిలో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో లో తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తున్న ఆది ఈ మద్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.  ఈ మద్య ఏపిలో ఎన్నికల సందర్భంగా జనసేన తరుపు నుంచి ప్రచారం కూడా చేశారు.  మొదటి నుంచి పవన్ కళ్యాన్ పరమ భక్తుడిగా ఉంటున్న ఆది ఆ మద్య కత్తి మహేష్ పై తనదైన పవర్ ఫుల్ పంచ్ డైలాగులు వదిలి సంచలనం రేపిన విషయం తెలిసిందే.  తాజాగా హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను నటించిన ‘చిత్రలహరి’సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు.   

ఈ సినిమాలో హీరోగా నటించిన సాయిధరమ్ తేజ్ మొదటి నుంచి తనదైన నటన ప్రదర్శిస్తూ వస్తున్నారని..మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఎలాంటి గర్వం అతనిలో లేదని అన్నారు.  మెగా ఫ్యాన్స్ కి కావాలసిన డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ అన్నింట్లో తన టాలెంట్ చూపిస్తున్నాడని..అందుకే మెగా ఫ్యాన్స్ కి సాయిధరమ్ అంటే ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు ఆది. ‘చిత్రలహరి’ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సాయిధరమ్ తేజ్ ను నేను దగ్గరగా పరిశీలించడం వలన నాకు ఒక విషయం అర్థమైంది.

ఆయనకి ముగ్గురు మేనమామల లక్షణాలు వచ్చాయి.  మెగాస్టార్ చిరంజీవిలా సెట్స్ లో అందరినీ సమానంగా చూడటం..నాగబాబు లా మనసులో ఎలాంటి కుళ్లు, కుతంత్రాలు లేకుండా ఉండటం..పవన్ కళ్యాన్ మాదిరి అందరికీ తనవంతు సహాయాన్ని అందించే సుగుణం కలిగిన వ్యక్తి..అందుకే ముగ్గురు మేనమామలను తనలో ఇమిడ్చుకున్నారని అంటున్నాని హైపర్ ఆది, సాయిధరమ్ తేజ్ ని తెగ మెచ్చుకున్నాడు.  తేజుతో కలిసి నటించే అవకాశం లభించడం ఆనందంగా వుంది అంటూ చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: