ఒకప్పుడు వెండితెరపై తమ అందాలతో కుర్రాళ్లను మంత్రముగ్దులను చేసిన హీరోయిన్లు వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అస్సలు గుర్తు పట్టరాకుండా అయిపోతుంటారు. సినిమాల్లో నటిస్తున్నంత సేపు జీరో సైజ్ కోసం నానా తంటాలు పడే హీరోయిన్లు పెళ్లైన తర్వాత తమ శరీర మార్పుల గురించి అస్సలు పట్టించుకోరు.  సన్నగా నాజూగ్గా ఉన్న చాలా మంది హీరోయిన్లు వివాహానంతరం బొద్దుగా తయారవుతుంటారు. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ తమ శరీరసౌష్టవాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు..బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఇందుకు ఉదాహారన అని చెప్పొచ్చు. 

తాజాగా  2005 లో వచ్చిన ‘నరసింహుడు’ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి తర్వాత మెగాస్టార్ తో జై చిరంజీవ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది సమీరా రెడ్డి. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా మంచి హిట్ సినిమాల్లో నటించింది.  ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే 2014 లో అక్షయ్ వార్డె ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. 

2015 లో బిడ్డకు జన్మను ఇచ్చింది. ఆ తర్వాత సమీరా దాదాపు 102 కేజీల బరువు పెరగడంతో అందరు షాక్ అయ్యారు.  ఒకదశలో ఎవరు ఈమె... సమీరానా కాదా అనేంతగా మారిపోయింది.  అయితే తన బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి తన స్టైలిష్ లుక్ లోకి వచ్చేసింది.సోషల్ దిగ్గజం ఇంస్టాగ్రామ్ లో 2015 లో ఉన్న ఫోటోను 2019 లో ఉన్న ఫోటోను షేర్ చేసింది.  ఈ ఫోటోను చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.  ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: