తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన సుర్జిత్ విల్సన్ అనే రెండేళ్ళ పసి బాలుడు బోరు బావిలో పడ్డ విషయం తెల్సిందే. ఆ బాలుడిని కాపాడేందుకు దాదాపు 80 గంటల పాటు ప్రభుత్వం, ఇతర స్వచ్చంద సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. బాలుడు బోర్ వెల్ లో ఉన్న సమయంలో
తమిళ స్టార్స్ చాలా మంది
ఆపరేషన్ సక్సెస్ అయ్యి బాలుడు బయటకు రావాలని కోరుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆ బాలుడి గురించి వార్తలు ప్రసారం అయ్యాయి. దేశ ప్రధాని వరకు కూడా ఈ విషయం వెళ్లి సంచలనం అయింది.
ఎంతగా ప్రయత్నించినా కూడా బాలుడిని కాపాడలేక పోయారు. బాలుడు మృతి చెందినట్లుగా ప్రకటించిన వెంటనే అందరు కూడా తీవ్ర దు:ఖంలో మునిగి పోయారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ బాలుడి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ బాలుడి మృతి నన్ను ఎంతగానో కలచి వేసింది. బాలుడి ఆత్మకు శాంతి కలగాలని
భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు. అంతేకాదు బాలుడి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు రజనీకాంత్.
ఈ సందర్బంగా ఇంకా పలువురు సినీ తారలు కూడా బాలుడి గురించి సోషల్ మీడియాలో స్పందించారు.
హీరోయిన్ సమంత..నటుడు
వివేక్ ఒబేరాయ్..దర్శకుడు అట్లీ..హీరో కం మ్యూజిక్
డైరెక్టర్ జీవీ ప్రకాష్ సహా ప్రముఖులు పలువురు బాలుడి గురించి సోషల్
మీడియా ద్వారా స్పందించారు. ఇక
రజనీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ బ్యూటి నివేదా థామస్ రజనీ కి కూతురు గా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ
సినిమా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.