ఇక ప్రస్తుతం గూఢచారి 2, అలానే మేజర్ సినిమాల్లో నటిస్తున్నారు శేష్. ఓవైపు నటిస్తూ మరోవైపు తన సినిమాలకు తానే రచన చేస్తూ కొనసాగుతున్న శేష్, ఈ రెండు సినిమాలతో కూడా విజయాలు అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే వీటిలో మేజర్ సినిమా గురించి మాట్లాడుకుంటే, దీనిని సూపర్ స్టార్ మహేష్ సొంత సంస్థ అయిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ మూవీస్ వారితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఈ సినిమాకి శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.
ద్విభాషా సినిమాగా తెలుగు, హిందీ భాషల్లో భారీ బడ్జెట్తో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండర్ మేజర్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషిస్తున్నారు అడివి శేష్. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక అప్ డేట్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన దబాంగ్ 3 సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సాయి మంజ్రేకర్ ని తమ సినిమాలోని ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకుంటున్నట్లు యూనిట్ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకు సాయి మంజ్రేకర్ గ్లామర్ కూడా తోడవడం మరింత ప్లస్ పాయింట్ అని అంటున్నారు విశ్లేషకులు ......!!