సినీ పరిశ్రమలో సినిమాల
కన్నా ఎక్కువగా ఒకరిపై మరొకరు రూమర్లను క్రియేట్ చేయడం ఇప్పుడున్న వాళ్లకు కామన్ అయిపోయింది. వేరే వారిని అంటేనే పాపులర్ అవుతామని చాలా మంది అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సినీ నటి
మాధవి లత.. ఆమె తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయితే ఎవరొకరిని తిడుతూ ఫేమస్ అవ్వడంతో పాటుగా నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది..
వివరాల్లోకి వెళితే..జీ తెలుగు లో ప్రసారావుతున్న
కామెడీ షో బొమ్మ అదిరింది. ఈ షో మొదట కొంత యాంకర్ గా
శ్రీముఖి ఎంట్రీ ఇచ్చినట్లు చేసిన ప్రోమోలో అన్న కొన్ని మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు రాజకీయ చర్చలకు దారితీసాయి.
జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు దగ్గరుండి
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్
రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారని
జగన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు..
షోలో
ఏపీ సీఎం
జగన్ మోహన్ రెడ్డిని హేళన చేస్తూ స్కిట్ రూపొందించడం అనేక వివాదాలకు దారి తీసింది..దాంతో పాటుగా అన్న వచ్చాడు అంటూ ఇమిటేట్ చేశారు. అది కాస్త
వైసీపీ అభిమానులకు మింగుడు పడలేదు..ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని హేళన చేస్తూ స్కిట్ చేయడం.. దానికి నాగబాబు, శ్రీముఖిలు పడిపడి నవ్వడంతో
జగన్ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో సోషల్
మీడియా వేదికగా
జగన్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
ఈ విషయం పై స్పందించిన
మాధవి లత మాట్లాడుతూ..అది ఒక
కామెడీ షో మాత్రమే.. జనాలను నవ్వించడానికి అందరినీ ఇమిటేట్ చేస్తే జనాలు చూస్తారు..ప్రజల్ని నవ్వించాలనే మంచి ఉద్దేశంతో వాళ్లు చేస్తున్నారు.. అయినప్పటికీ వాళ్లు పెద్ద మనసు చేసుకుని క్షమాపణ చెప్పారు. అయిన
జగన్ అభిమానులు మహిళల గురించి ఇలాంటి పోస్ట్లు పెట్టడం తప్పు’ అంటూ ఖండించారు మాధవీలత.ప్రస్తుతం ఈ విషయానికి
మాధవి లత అద్యం పోసినట్లు అయ్యింది.