
కానీ, ఇప్పుడు ఆయన మళ్ళీ తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి “దేవర” సినిమాతో బరిలోకి దిగారు. జూనియర్ ఎన్టీఆర్ తో వస్తున్న ఆ సినిమా హిట్ అయితే, కొరటాల మళ్లీ తన పాత ఫామ్ లోకి రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే… “దేవర 2” పూర్తయ్యాక వెంటనే బాలయ్యతో కొరటాల సినిమా ఫిక్స్ అయిపోయిందట.
ఈ వార్త బయటికి రాగానే “ఇది అంతా చిరు మీద కోపమేనా?” అన్న ప్రశ్న పెద్ద చర్చగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కొరటాల – చిరంజీవి కలయికలో వచ్చిన “ఆచార్య” విఫలమైంది. ఆ విఫలంతో చిరంజీవి, కొరటాల మధ్య గ్యాప్ ఏర్పడింది. దాంతో చిరు మళ్ళీ ఆయనతో పని చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపించింది. ఇలాంటి టైమ్లోనే బాలయ్య కొరటాలకు ఛాన్స్ ఇవ్వడం.. అది కూడా చిరు మీద మాటల యుద్ధం ముదురుతున్న సమయంలో ఇవ్వడం.. “అత్త మీద కోపం దుత్త మీద చూపడం” అన్న సామెతను గుర్తు చేస్తోంది.
అయితే ఇది నిజమా? లేక కేవలం రూమర్స్ మాత్రమేనా అన్నది ఇంకా క్లియర్ కాదు. కొంతమంది బాలయ్య అభిమానులు – " మా బాలయ్య ఎప్పుడూ వ్యక్తిగత కోపంతో సినిమాలు ఫిక్స్ చేసుకునే వారు కారు. ఆయనకు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు అంతే” అంటున్నారు. కానీ మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం – “చిరంజీవి మీద కోపం కారణంగానే బాలయ్య ఈ డెసిషన్ తీసుకున్నాడు” అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.మరి ఇందులో నిజం ఎంత, ఊహాగానం ఎంత అన్నది కాలమే తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం – బాలయ్య, చిరు ఫ్యాన్స్ మధ్య ఈ కొత్త వార్త చర్చల తుఫాన్ రేపేస్తోంది.