సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అర్జున్. కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ బాబు అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించగా కీర్తి రెడ్డిమూవీ లో మహేష్ కి అక్కగా నటించిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు సీనియర్ నటి సరిత కూడా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె నెగటివ్ పాత్ర చేసి అందరినీ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఆమె ఆ మూవీ ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పట్లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ సినిమా కేవలం యారేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది.
ఇక ఆ తరువాత మళ్ళి ఆమె టాలీవుడ్ తెరపై కనిపించని లేదు. అయితే మధ్యలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లోని సీనియర్ నటీమణులకు డబ్బింగ్ మాత్రం చెప్తున్నారు. ఇక ప్రస్తుతం వేణుశ్రీరాం దర్సకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ మూవీ గా పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అవ్వగా, పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా విషయమై లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలోని ఒక కీలకమైన లేడీ పాత్రకు గాను సీనియర్ నటి సరిత ని ఎంపిక చేసాడట దర్శకుడు క్రిష్. సినిమాలో ఎంతో కీలకమైన ఆ పాత్రకు గాను సరిత అయితేనే కరెక్ట్ అని భావించిన యూనిట్ ఆమెను ఎంపిక చేసిందని, అతి త్వరలో దీనికి సంబందించిన అధికారిక సమాచారం కూడా వెల్లడి కానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే అప్పుడు మహేష్ సినిమాలో నటించి మంచి పేరు దక్కించుకున్న సరిత ని మళ్ళి చాలా ఏళ్ళ తరువాత పవన్ సినిమాలో చూడవచ్చన్నమాట .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: