మీర్జాపూర్ అనేది ఉత్తర ప్రదేశ్లోని ఓ ప్రాంతం పేరు. మీర్జాపూర్ అనే పేరు పెట్టి యూపీ రాష్ట్ర పేరును కించపరుస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ మత, సామాజిక, ప్రాంతీయ సెంటి మెంట్లను కూడా రెచ్చగొట్టే విధంగా ఉందని, ఇందులో సన్నివేశాల వల్ల మతాల మధ్య చిచ్చు రేగే అవకాశముందంటూ పిటిషన్లో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సుప్రీం కోర్టు ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ మేకర్స్తో పాటుగా స్ట్రీమింగ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ సంస్థకు కోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ వెబ్ సిరీస్పై కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి మీర్జా పూర్ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం.
మీర్జాపూర్ వెబ్ సిరీస్పై గతంలో అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్ కూడా విమర్శలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ ప్రాంతం సామరస్యానికి, ప్రశాంతతకు కేంద్రంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటువంటి ప్రదేశాన్ని వెబ్ సిరీస్లో హింసాత్మక ప్రాంతంగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. దీనిపై విచారణ చేపట్టాలని, అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కాగా.. మీర్జాపూర్ కథాంశం మొత్తం గ్యాంగ్ వార్ చుట్టూనే తిరుగుతుంది. మొదటి సీజన్ గ్యాంగ్ వార్ అవ్వగా.. ఇటీవల విడుదలైన రెండో సీజన్ మొత్తం రాజకీయాలు, ఎన్నికలు, కుటుంబాల మధ్య వైరుద్యాల చుట్టూ తిరుగుతుంది.