హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా
సుమన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులైన వారే. నీచల్ కులం అనే సినిమాతో రంగ ప్రవేశం చేసి తెలుగు తమిళ
కన్నడ భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు. కరాటేలో మంచి అనుభవం ఉన్న
సుమన్ తెలుగులో యాక్షన్ హీరోగా ఎదిగాడు. ఫ్యామిలీ కథలలో ఎక్కువ గా నటించే ఈ యాక్షన్
హీరో ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి విలన్ గా సైతం మెప్పించి ప్రముఖ
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రజనీకాంత్ హీరోగా వచ్చిన
శివాజీ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడం మొదలుపెట్టారు సుమన్.
మద్రాసులో పుట్టి పెరిగిన
సుమన్ చిన్నతనం నుంచే సినిమాల్లో నటించాలని కలలు కన్నాడు. కరాటే
మాస్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించి కుటుంబ స్నేహితుడు ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలో పోలీసు అధికారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న
సుమన్ నీలి చిత్రాల నిర్మాణ స్కాంలో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడ్డాడు. చివరికి ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి మళ్లీ నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన హీరోగా నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాలేదు. కానీ కష్టాలు పడడం అలవాటు పడిపోయిన
సుమన్ కి ఇదేం పెద్ద కష్టం అనిపించలేదు.
హైదరాబాదులో స్థిరపడిన
సుమన్ తెలుగు సినీ నాటక
రచయిత డి.వి.నరసరాజు మనవరాలు శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. కొండపల్లి రాజా, శ్రీరామదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, అన్నమయ్య, వీడు తేడా ఆడుమగాడ్రాబుజ్జి ,
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ,
తండ్రి పాత్రలు, ఆన్న పాత్రలు కూడా పోషించి
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకున్నారు. భవిష్యత్తులో ఈ నటుడి నుంచి ఇంకా ఎన్నో మంచి పాత్రలు చూడొచ్చన్నమాట.