పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డాం ప్రస్తుతం ఆకాశమంత ఎత్తులో ఉంది. ఈ మద్యనే విడుదలైన భీమ్లా నాయక్ పాట విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ పాట, చిన్న గ్లిమ్స్ తో భీమ్ల నాయక్ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. మొన్నటిదాకా ఈ సినిమాని ఒక రీమేక్ గానే చూసే జనాలని చిన్న టీజర్ తో భీమ్ల నాయక్ సినిమా అందరి కళ్లని తన వైపు తిప్పుకుంది. అయితే ఈ ఒక్క సినిమాతోనే కాదు పవర్ స్టార్ వరస సినిమాల సెలక్షన్ చూసి స్టార్ హీరోస్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

భీమ్ల నాయక్ దాదాపుగా పూర్తి అవ్వడంతో పవన్ ఇంకొక 3 సినిమాలని లైన్ లో పెట్టాడు . క్రిష్ , హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్స్ పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఇందులో క్రిష్ సినిమా మీద అందరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది . ఎందుకంటే మొదటిసారి పవన్ ఒక పురాణ కథలో నటిస్తుండడం అలాగే ఈ సినిమా టీజర్ లో పవన్ లుక్ అదిరిపోవడం సినిమా మీద అభిమానుల్లో ప్రత్యేక శ్రద్ధ ని తీసుకొచ్చింది. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసిన పవన్ మళ్ళీ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు.

అందుకోసం డైరెక్టర్ క్రిష్ ని మరియు ఈ సినిమా నిర్మాత ఏ యమ్ రత్నం తో ఈరోజు సమావేశం అయ్యారట. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలోనే మళ్ళీ పట్టాలు ఎక్కబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా విడుదల కాబోతుంది అని మూవీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ భామ జక్యూలైన్ ఇంకొక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: