నాని 'జెండాపై కపిరాజు' సినిమాతో తెలుగువారికి పరిచయం అయ్యింది రాగిణి ద్వివేది. తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. అయితే వీళ్లు బెయిల్పై బయటకొచ్చాక కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం నుంచి కుదుటపడింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ ప్రకంపనలు సృష్టించాయి. స్టార్ డైరెక్టర్లు, హీరోలు ఈ డ్రగ్స్ కేసులో విచారణకి హాజరయ్యారు. మూడేళ్లకి పైగా సాగిన ఈ డ్రగ్స్ కేసుల్లో ఇటీవలే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు నార్కోటిక్స్ అధికారులు.
టాలీవుడ్లో డ్రగ్స్ ఇంటరాగేషన్ కొన్ని సంవత్సరాల పాటు సాగింది. నాలుగేళ్ల క్రితం పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, నందు, తనీష్, నవదీప్ లాంటి స్టార్స్ని ఇంటరాగేట్ చేశారు. ఆ సమయంలో టాలీవుడ్ మత్తులొ మునిగిపోతోందని, స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇలా చాలా వార్తలు ప్రచారం అయ్యాయి. డ్రగ్స్ కేసులో ఈ ఏడాది కూడా టాలీవుడ్ స్టార్స్ని విచారించారు ఈడి అధికారులు. రవితేజ, రానా లాంటి స్టార్లు కూడా ఈ ఇంటరాగేషన్కి అటెండ్ అయ్యారు. అయితే లాంగ్ ఇంటరాగేషన్లు, భారీ ప్రచారాల మధ్యలో డ్రగ్స్కేసులో తెలుగు సినిమా స్టార్స్ అందరికీ క్లీన్ చిట్ వచ్చింది. తెలుగు, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమలని ఈ డ్రగ్స్ వ్యవహారం చుట్టు ముట్టడంతో సినీపెద్దలు చాలా ఫీలవుతున్నారు. డ్రగ్స్ కేసులతో ఇండియన్ సినిమా ఇమేజ్ దెబ్బతింటుందని వాపోతున్నారు.