టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా రెండేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన సూపర్ స్టార్, ఆ తరువాత కరోనా కారణంగా సర్కారు వారి పాట షూట్ ని ఆలస్యంగా మొదలెట్టాల్సి వచ్చింది.

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తుండగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కి చెందిన పలువురు నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థలు 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు నిర్మస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి కాగా నిన్నటి నుండి లాస్ట్ షెడ్యూల్ ని మొదలెట్టారు, అయితే మహేష్ బాబు ఫిబ్రవరి 2వ వారంలో ఈ షెడ్యూల్ లో జాయిన్ కానున్నట్లు టాక్. ఇక విషయం ఏమిటంటే, రేపు ఫిబ్రవరి లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఏకంగా మొత్తం మూడు పండుగలు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ లో సందడి చేసారు సూపర్ స్టార్, కాగా ఆ షోని ఫిబ్రవరి 4న ప్రసారం చేయబోతున్నట్లు ఆహా వారు ఇటీవల ప్రకటించారు. అలానే సర్కారు వారి పాట మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనుంది యూనిట్. అయితే ఇవి రెండు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న భారీ పాన్ ఇండియా మూవీ ఓపెనింగ్ ని ఫిబ్రవరి 3న జరపడానికి ఆ మూవీ యూనిట్ నిర్ణయించిందని టాక్. మరి ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ ఫిబ్రవరి లో ముచ్చటగా మూడు పండుగలు ఉంటాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: