రవితేజ హీరోగా నటించిన కిలాడి చిత్రం యొక్క వివాదం ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో రవితేజ ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడం దర్శక నిర్మాతలు సైతం ఈ సినిమాకు సంబంధించి హీరో విషయంలో ఎలాంటి కామెంట్లు చేయకపోవడం వంటివి జరుగుతుండడం అందరిలో ఎన్నో అనుమానాలను కలిగించాయి. రవితేజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీటికి క్లారిటీ వచ్చింది అని చెప్పవచ్చు.

దర్శకుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది అని వస్తున్న వార్తలకు ఆ రోజు ఆయన చేసిన స్పీచ్ నిదర్శనం. ఆ తర్వాత వీరిద్దరు కూడా పెద్దగా తారసపడలేదు. అయితే సినిమా విడుదల సందర్భంగా రమేష్ వర్మ భార్య రవితేజ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చీప్ స్టార్ అంటూ ఆమె తనను విమర్శించిన ఆమె వ్యాఖ్యలను బట్టి  ఈ సినిమా విషయంలో ఓ పెద్ద గొడవ జరిగిందని వస్తున్న వార్తలు నిజం అయ్యాయి.

అయితే ఏ విధమైన గొడవ జరిగింది అనే విధంగా అభిమానులు ఆరా తీసే పనిలో ఉన్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరికీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్లనే దూరం పెరిగిందని అంటున్నారు. రవితేజ అనుకున్న విధంగా సినిమా చేయక పోవడం వల్లనే రమేష్ వర్మ మధ్య గ్యాప్ పెరిగిందట. అంతేకాదు దర్శకుడు రమేష్ వర్మ కథ చెప్పిన విధంగా సినిమా చేయడం లేదని కోపం పెరిగి పోయిందట. దాంతో షూటింగ్ విషయంలో ఆయనకు పెద్దగా సహకరించలేదు రవితేజ. అయితే రవితేజ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకోలేదని ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం రవితేజ అభిమానులలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: