అందాల ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ హీరో గా తెరకెక్కిన మాయాజాలం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా మాయాజాలం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది,  ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ ఆ మూవీ లు కూడా పెద్దగా సక్సెస్ సాధించకపోవడం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పూనమ్ కౌర్ కు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ప్రేక్షకులకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా మాత్రం ఏదో ఒక విషయం ద్వారా ఎప్పుడూ పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది, ఇది ఇలా ఉంటే అందాల ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక సినిమాలో నటించింది.

 పూనమ్ కౌర్ నటించిన నాతిచరామి సినిమా ఈ నెల 10 వ తేదీన 'ఓ టి టి' లో విడుదల అయింది,  ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది, పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ పలువురు హీరోల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది.   పూనమ్ కౌర్ అందులో భాగంగా రామ్ చరణ్ గురించి ఎన్నో చెప్పాలని ఉందని, కానీ ఇప్పుడందుకు సమయం కాదని తెలియజేసింది,  రామ్ చరణ్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటానని పూనమ్ కౌర్  తెలియజేసింది.  అలాగే మెగాస్టార్ చిరంజీవి తమ కుటుంబం మొత్తానికి ఫేవరెట్ హీరో అని పూనమ్ కౌర్ తెలియజేసింది,  బాల్యంలో తన తండ్రితో కలిసి చిరంజీవి సినిమాలకు ఎక్కువగా వెళ్లేదాన్నని పూనమ్ కౌర్ తెలిపింది, ఇలా తాజా ఇంటర్వ్యూ లో పూనమ్ కౌర్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: