ఏదైనా సినిమా ప్రమోషన్ ఉంటే ఆ ప్రమోషన్ లో తమ సినిమాలకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు దర్శక నిర్మాతలు, నటీనటులు చెప్పడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. అయితే ఆయా సినిమాలు హిట్ అయినా కూడా సీక్వెల్ తీయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు సాహసించరు. అలాంటిది సినిమా కనుక ఫ్లాప్ అయితే అసలు సీక్వెల్ జోలికి పోరు. ఎందుకంటే ఒక సినిమాకి సీక్వెల్ తీయాలంటే అంత రిస్క్ ఉంటుంది కాబట్టి. అందుకే సీక్వెల్ జోలికి వెళ్లాలంటే సినీ జనాలకి చాలా భయం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది దర్శక నిర్మాతలకు ఆ భయం కాస్త ఎక్కువే ఉంటుంది. 

ఇక అసలు విషయంలోకి వస్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల 'రిపబ్లిక్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. విభిన్న కథా చిత్రాల దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కొన్ని రాజకీయ కారణాల వల్ల అనుకోని రీతిలో దెబ్బ పడింది. కానీ ఈ సినిమా ఓ టి టి లో మాత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే రిపబ్లిక్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలో కొన్ని ప్రచారాలు జరిగాయి. స్వయంగా ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా కూడా రిపబ్లిక్ ఈ సినిమాకి సీక్వెల్ తీస్తాను అని కూడా అన్నాడు. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సీక్వెల్ లో నటిస్తే బాగుంటుందని కూడా చెప్పాడు.

అయితే తాజాగా ఈ సీక్వెల్ పై వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ ఏడాది ద్వితీయార్ధం నాటికి రిపబ్లిక్ సీక్వెల్ మీద ఓ క్లారిటీ రాబోతుందట. అయితే రిపబ్లిక్ సినిమాలో హీరోగా నటించిన సాయిధరమ్తేజ్ హీరోగానే ఈ సీక్వెల్ ఉంటుందని.. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఒకవేళ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యమైతే 2024 ఎన్నికల ముందు సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయిమ్ మరి ఓ ప్లాప్ సినిమాకి సీక్వెల్ అంటే రిస్క్ చేయడం అనే చెప్పాలి. అయితే కొంతమంది ఈ వార్త తెలిసిన సినీ విశ్లేషకులు మాత్రం తేజు ఈ సీక్వెల్ చేయకపోవడమే బెస్ట్ ఏమో అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: