తమిళ స్టార్ హీరో విజయ్ ఒక ద్విభాష సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో  ఒకేసారిగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు వంశీ పైడిపల్లి ప్రకటించి చాలా రోజులే అవుతున్నా ఇంత వరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి ముందడుగు కూడా పడలేదు. వచ్చే నెల ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిచడానికి వంశీ పైడిపల్లి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ ఫినిష్ కావడం తో షూటింగ్ ని లాంఛనంగా స్టార్ట్ చెయ్యాలని దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నారట. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీలో హీరో విజయ్ కి జోడీగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇంకా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కృతిసనన్ నటించే అవకాశాలు వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 



ఇటీవల రష్మిక మందన్న నటించే అవకాశం వుందని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ అయితే మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని దిల్ రాజు వంశీ పైడిపల్లి భావించి కృతి సనన్ని ఫైనల్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ వర్క్ ని జరుపుకుంటోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని ఇక వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఇదిలా వుంటే విజయ్ హీరోగా నటించిన `బీస్ట్` సినిమా ఏప్రిల్ 13 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు డి. సురేష్ బాబు ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: