పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఇప్పుడు వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్తూ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు మూడు సినిమాలను చేసే ఆలోచనలో ఉన్న పవన్ ఇప్పటికే అలా మూడు సినిమాలను విడుదల కు సిద్ధం చేస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా ను ప్రారంభించి త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నాడు.

సినిమా యొక్క తాజా షెడ్యూల్ ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాదులో మొదలు కాగా క్రిష్ జాగర్లమూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పద్మశ్రీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నేతృత్వంలో ఈ సినిమాకు ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ చిత్రం యొక్క చిత్రీకరణ ప్రారంభం అయ్యింది ఈ సినిమాలోని పాత్ర కోసం పవన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ పోరాట ఘట్టాలు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో ఈ మూవీ కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యింది అని తెలిసింది. దాంతో ఈ సినిమా కోసం దాదాపు ఐదు నెలల డేట్స్ కేటాయించాడు పవన్ కళ్యాణ్.

ఆ విధంగా ఈ సినిమా పూర్తయ్యే వరకు మరొక చిత్రానికి వెళ్లే అవకాశం లేదని అందరూ భావించారు కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ చేస్తూనే మరో రెండు రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమా ల కోసం హరి హర వీర మళ్లీ సినిమా కు బ్రేక్ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. జూలై నుంచి ఈ సినిమా కు బ్రేక్ ఇవ్వబోతున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ను జూలై వరకు చేసి ఎంత అయితే అంత కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ రీమేక్ చిత్ర షూటింగ్ ల లో ఆయన పాల్గొంటున్నాడు. ఏదేమైనా క్రిష్  ఈ సినిమా పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: