టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే.ఇకపోతే ఈమె ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ సమంత.అయితే ఆ తర్వాత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ద్వారా ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే కొన్ని రోజులు హైదరాబాద్ లో మరికొన్ని రోజులు ముంబైలో ఉంటున్న సమంత బాలీవుడ్ ఎంట్రీ కోసమే అక్కడ ఎక్కువగా గడుపుతోందని ప్రచారం జరుగుతోంది.పోతే ఎట్టకేలకు ఒక మంచి బాలీవుడ్ ప్రాజెక్ట్ ను సామంత సెట్ చేసుకుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆమె పలు బాలీవుడ్ సినిమాలు ఒప్పుకున్నట్లు వార్తలు రాగా దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు.

ఇదిలావుంటే ఈ మధ్యనే తాప్సీ పన్ను తాను నిర్మించే సినిమాలో సమంత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది.ఇక తాజాగా ప్రచారం జరుగుతున్న వరకు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.అయితే  ఈ సినిమాని దినేష్ విజయ్ నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన రాతకోతలు ఇప్పటికే పూర్తయ్యాయి అని, ప్రస్తుతం షెడ్యూల్స్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతుంది అని అంటున్నారు.అయితే  ఇదంతా నిజమైతే కనుక సమంత నటిస్తున్న మొట్టమొదటి హిందీ సినిమాకి రంగం సిద్ధమైనట్టే చెప్పాలి.

పోతే దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.కాగా తాప్సీ పన్ను నిర్మించే ఒక సినిమాలో సమంత నటిస్తున్నట్టు ఆమె క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అది ఎలాంటి సినిమా అనే విషయం మీద కూడా ఇప్పుడు పలు రకాల వార్తల పుట్టుకు వస్తున్నాయి. అయితే ఇది ఒక భారీ బడ్జెట్ మైథాలజికల్ సబ్జెక్టు ఉన్న సినిమా అని తెలుస్తోంది.పోతే  ఇప్పటికే సమంత తమిళ, తెలుగు భాషలలో వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే తెలుగులో ఆమె చేసిన యశోద, శాకుంతలం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషీ అనే సినిమా మాత్రం షూటింగ్ దశలో ఉంది. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: