ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా సినిమా విడుదల కు దగ్గర పడింది అంటే ఆ మూవీ యూనిట్ ఆ సినిమా ఏ రేంజ్ టికెట్ ధరలతో ప్రేక్షకుకుల ముందుకు రాబోతోంది అనే విషయాన్ని ముందుగానే అధికారికంగా ప్రకటిస్తూ ఆ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తూ అధికారిక ప్రకటనలు చేస్తున్నాయి .

అందులో భాగంగా తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ యూనిట్ కూడా ఈ సినిమా టికెట్ ధరలను  తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది . రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా జూలై 29 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా టికెట్ ధరను ప్రకటించింది . ఈ సినిమా టికెట్ ధరలు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ,  మల్టీప్లెక్స్ థియేటర్ లలో 195 రూపాయలు గాను ఉండనున్నట్లు ప్రకటించింది.  

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లాలి 147 రూపాయలు గాను , మల్టీప్లెక్స్ థియేటర్  లలో 177 రూపాయలు గాను ఉండనునట్టు రామారావు ఆన్ డ్యూటీ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు శరత్ మండువ దర్శకత్వం వహించగా రాజిషి విజయన్ , దివ్యాంశ కౌశిక్మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు.  ఈ మూవీ లో రవితేజ సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ తో రవితేజ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: