టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమో గాని ఫ్యాన్స్ ని అయితే ఎంతగానో అలరించింది.ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో మొఘల్ కాలానికి చెందిన టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా అలాగే పవర్ స్టార్ ఇందులో రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు కనిపించనటువంటి పాత్ర కాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక గత కొద్ది రోజులుగా సినిమా కోసం మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది ఇక హై బడ్జెట్ ఇష్యూ వలన గతంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది.


ఎప్పుడో చిత్రీకరణను ప్రారంభించుకున్న ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. కానీ అస్సలు కుదరట్లేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశం కోసం తమిళనాడులో EVP స్టూడియోలో సెట్ వేశారట.ఇక 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'హరిహర వీరమల్లు'తో మరోసారి సంక్రాంతికి రావాలని మూవీ టీం వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారైనా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.ఈ సినిమా మొత్తం 4 భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: