యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే .  మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందు కోలేక బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది . ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు .

ఇలా ది వారియర్ మూవీ తో తన అభిమానులను ,  ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో  హీరో గా నటించబోతున్న విషయం మనకు తెలిసిందే . ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో  ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు ,  అందులో ఒక ఒక పాత్రలో రామ్ పోతినేని దోపిడి దొంగల కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన రష్మిక మందన లేదా ప్రియాంక అరుల్ మోహన్ లలో ఎవరో ఒకరిని  హీరోయిన్ గా మూవీ యూనిట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: