దక్షిణాదిలోనే అగ్ర దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శంకర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో చరణ్ తో కలిసి వినయ విధేయ రామ అనే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే ఆ చిత్రం భారీ ఫ్లాప్ కావడంతో మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి ఆమె ఎక్కువగా ఆసక్తి కనబరచలేదు.

బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే మెగా పవర్ స్టార్ పిలిచి మరి అవకాశాన్ని ఆమె కు ఇచ్చాడు. ఈ సినిమా తో నైనా ఈమె మంచి సక్సెస్ అందుకుంటుందా అనేది చూడాలి. లేకపోతే శంకర్ గతంలో ఆగిపోయిన ఓ సినిమాను మళ్ళీ స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కమల్ హాసన్ హీరోగా రూపొందిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాను మొదలుపెట్టడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు.

కానీ పలు కారణాలవల్ల ఈ చిత్రం ముందుకు వెళ్లలేక పోయింది. ఇటీవలే హీరో కమల్ హాసన్ మధ్యవర్తిగా వ్యవహరించి ఇట్లు నిర్మాత లకు అటు దర్శకుడికి ఇద్దరికీ కూడా సంధి కుదురుచ్చారు. ఆ విధంగా ఈ సినిమాను త్వరలోనే మళ్లీ రీస్టార్ట్ చేయబోతున్నాడు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు సినిమాలను ఒకేసా రి చేసే విధంగా శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. రెండు కూడా ప్రతిష్టాత్మకమైన సినిమాలే కాబట్టి ఈ రెండు చిత్రాలను అలరించే విధంగా హ్యాండిల్ చేస్తాడా అని ఇక్కడ ఆసక్తిక రమైన విషయం. మరి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు ఈ రెండు సినిమాలతో ఎలాంటి విజయాలను ప్రేక్షకులకు అందిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: