తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా నటించి మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్థానం , రన్ రాజా రన్ , ఎక్స్ ప్రెస్ రాజా , శతమానం భవతి వంటి మంచి విజయవంతమైన మూవీ లతో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ గత కొంత కాలంగా మాత్రం వరస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా శర్వానంద్ , అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సిద్ధార్థ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా , రీతు వర్మమూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది.

వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ తో అయినా శర్వానంద్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: