అందాల ముద్దు గుమ్మ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో మల్లీశ్వరి , అల్లరి పిడుగు వంటి తెలుగు మూవీ లలో నటించిన కత్రినా కైఫ్మూవీ లతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మల్లీశ్వరి , అల్లరి పిడుగు మూవీ లలో మల్లీశ్వరి మూవీ మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించింది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కత్రినా కైఫ్ ఆ తర్వాత  తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కు అనేక బాలీవుడ్ మూవీ లలో అవకాశాలు దక్కాయి. ఈ ముద్దు గుమ్మ నటించిన ఎన్నో మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవడంతో కత్రినా కైఫ్ ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొన సాగింది.  

కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలు అయి నటు వంటి సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది.  ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కత్రినా కైఫ్ ,  విక్కీ కౌశల్ ని పెళ్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ గుజరాత్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే కత్రినా కైఫ్ తన పెళ్లి వరకు ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదు. పెళ్లి ముగిసిన తర్వాత ఆ ఫోటో లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కత్రినా కైఫ్ తన పెళ్లి గురించి స్పందించింది. కరోనా కారణం వల్లే తన పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు అని కత్రినా కైఫ్ తాజాగా వెల్ల డించింది. కరోనా వల్ల తమ కుటుంబం చాలా ఇబ్బంది పడింది అని అందుకే రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది అని కత్రినా కైఫ్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: