తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ ఈషా రెబ్బా. అయితే తాజాగా ఒక తమిళ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలో అతన్ని వివాహం చేసుకోబోతుందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. "అంతకుముందు ఆ తర్వాత" అనే చిత్రంతో ఈమె మొదట హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత బందిపోటు, సుబ్రహ్మణ్యపురం, బ్రాండ్ బాబు, దర్శకుడు, అరవింద సమేత తదితర సినిమాలలో నటించింది. అందంతోపాటు అభినయంతో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదని చెప్పవచ్చు.


అందుచేతనే పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ ద్వారా మొదటిసారిగా ఓటీటీ లో అడుగుపెట్టింది ఈషా రెబ్బా. త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ తో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే మరొకవైపు హాట్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇంత అందం ఉండి గ్లామర్ షో చేస్తున్నప్పటికీ ఈమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం తెలుగమ్మాయి అన్న ఒక్క రీజన్ వల్లే ఈమెకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఈమె ముంబై , చెన్నై వంటి ప్రదేశాల నుంచి వచ్చి ఉండి ఉంటే కచ్చితంగా ఈమెకు అవకాశాలు క్యూ కట్టేవి.

ఇక తమిళ్, మలయాళం, కన్నడ ఆఫర్లను అందుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంది ఒక తమిళ్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని త్వరలోనే అతనితో ఏడడుగులు వేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే వీరి ప్రేమను మీరు కుటుంబాలు కూడా అంగీకరించాయట.  ఇక త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేయనున్నారు అని తమిళ మీడియాలో వార్తలు కోడే కోస్తూ ఉండడం గమనార్హం. ఈ వార్త నిజమైతే మన తెలుగింటి అమ్మాయి తమిళ్ ఇంటి కోడలు కాబోతోంది అంటూ చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె కన్నడలో ఎస్ఆర్కె అనే సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: