టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి , ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ తో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ  ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం విజయ్ దేవరకొండ బాక్సా ఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ హీరో కొంత కాలం క్రితం డియర్ కామ్రేడ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్బుగా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో ఐశ్వర్య రాజేష్ , రాశి కన్నా , క్యాథరిన్ , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ , అనన్య పాండే హీరోయిన్ గా ,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , శివ నిర్మాణ దర్శకత్వంలో సమత హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: