టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయిన నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నవీన్ పోలిశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు . ఆ తరువాత ఈ హీరో అనుదీప్ కే వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ లో హీరో గా నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన జాతి రత్నాలు మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది . అలాగే ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో దక్కాయి .

జాతి రత్నాలు మూవీ తో నవీన్ పోలిశెట్టి , అనుదీప్ కే వీ క్రేజ్ అమాంతం పెరిగి పోయాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి వరస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అలాగే అనుదీప్ కే వీ ప్రస్తుతం కోలీవుడ్ క్రేజీ హీరో లలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రిన్స్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే నవీన్ పోలిశెట్టి , అనుదీప్ కే వి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్క బోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుదీప్ కే వీ , నవీన్ పోలిశెట్టి కి ఒక కథ ను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన నవీన్ వెంటనే అనుదీప్ కె వి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: