అల్లు అర్జున్ తమ్ముడుగా కాకుండా తనకంటూ ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. హీరోగా మారినప్పటికీ ఇప్పటివరకు అతడి కెరియర్ కు సంబంధించి సరైన హిట్ రాకపోవడంతో అతడికి చెప్పుకోతగ్గ అవకాశాలు రావడంలేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ తన వెనక ఉన్నప్పటికీ శిరీష్ కెరియర్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.


లేటెస్ట్ గా అతడు నటించిన ‘ఊర్వశివొ రాక్షశివొ’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. తన కెరియర్ కు అత్యంత కీలకమైన ఈమూవీని శిరీష్ ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సీక్రెట్ బయట పెట్టాడు. తాను గత కొంత కాలంగా ముంబాయ్ లో ఉంటున్న నేపధ్యంలో తన పై వచ్చిన గాసిప్ లపై స్పందిస్తూ తాను ముంబాయ్ లో అన్ని నెలలు ఎందుకు దూరంగా ఉన్నది తెలియచేసాడు.


తాను తన సన్నిహితులతో కలిసి ముంబాయ్ లో ఒక కొత్త వ్యాపారం గురించి స్టడీ చేయడానికి తాను ముంబాయ్ కి వెళ్లానని చెప్పాడు. అయితే ఆవ్యాపారం ఏమిటి అన్నది శిరీష్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈవ్యాపారం ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి కాని ఉండే అవకాశం ఉంది అంటూ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే తన కొత్త వ్యాపారానికి సంబంధించిన అన్ని వివరాలు రాబోతున్న కొత్త సంవత్సరంలో తెలియచేస్తానని మరో క్లారిటీ ఇచ్చాడు. తనకు అనేకమంది దర్శక నిర్మాతల నుండి ఆఫర్లు వస్తున్నప్పటికీ వారు చెప్పే కథలు నచ్చక తాను సినిమాలలో నటించడం లేదు కానీ తనకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు అన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా విడుదల కాబోతున్న తన మూవీ ‘ఊర్వశివొ రాక్షశివొ’ గురించి మాట్లాడుతూ ఈమూవీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెపుతూ తనకు ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుంది అన్న నమ్మకం తనకు ఉంది అని అంటున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: