కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా చిత్రంతో మంచి సక్సెస్ మీద ఉన్నారు. స్వయంగా ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నారు. ఇక ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడమే కాకుండా ఒక్కసారిగా ఈ హీరో కెరియర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇక హీరో నటనపై పై ప్రశంసలు వర్షం కూడా కురిపించారు ప్రేక్షకులు సినీ ప్రముఖులు. ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వస్తూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ చూడడం కూడా జరిగిందట.


ఇక ఆటు తర్వాత ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కూడా కురిపించారు. ఈ మేరకు  రజనీకాంత్ ఆహ్వానం మేరకు నిన్నటి రోజున ఆయన నివాసానికి వెళ్లి రిషబ్ ను సన్మానించడం జరిగింది. రజనీకాంత్ కాంతార చిత్రం తనకి ఎంతో బాగా నచ్చిందని తెలియజేశారు. రిషబ్ కు శాలువా కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం వీరిద్దరూ ఈ చిత్రం గురించి పలు విశేషాలను సైతం ముచ్చటించారు. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ సూపర్ స్టార్ కు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.


మీరు మమ్మల్ని ఒక్కసారి మెచ్చుకుంటే మాకు 100 సార్లు అనిపిస్తుందని.. ధన్యవాదాలు రజిని సార్ మా చిత్రం అభినందించడం మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ సినిమా కర్ణాటక కేరళ సరిహద్దులో ఉండే ఆదివాసుల సాంప్రదాయ భూతకోల సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రాన్ని హుంబలే ఫిలిం బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్గా సప్తమి గౌడ, కిషోర్ ,అచ్యుత్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: