టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఈ ఏడాది చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇటీవల వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. మొదట గూడచారి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మేజర్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు మోస్ట్ అవాయిడ్ హీరోయిన్ గా కూడా పేరు పొందడంతో పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. అలా మేడ్ ఇన్ హెవెన్ నహ ది నైట్ మేనేజర్ సినిమా విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది

 ఇప్పటికే షూటింగ్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉంటోంది. శోభిత ధూళిపాళ్ల ఇటీవల ps -1 సినిమాలో వానతి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి మెప్పించింది ఈ తెలుగు అమ్మాయి. ఇంతలోనే దేవ్ పటేల్ సరసన హాలీవుడ్ చిత్రం ఇది మంకీ మ్యాన్ అనే సినిమాకి డబ్బింగ్ చెప్పింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా నుంచి ఒక పోస్ట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలో డబ్బింగ్ చెబుతున్నటువంటి ఒక ఫోటో షేర్ చేయడం జరిగింది శోభిత.సినిమా మొదటిసారి హాలీవుడ్ ప్రాజెక్టులో నటిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది అంటు తెలియజేసింది. శోభిత ఇటీవల బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక గూఢచారి సినిమాకి సీక్వెల్ గా రాబోయే సినిమాలో కూడా ఈమె నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: