కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ ఇప్పటికే వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ తాను నటించిన అనేక ఇతర భాష మూవీ లను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ ఆఖరుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన బీస్ట్ మూవీ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లను రాబట్టలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు అనే తమిళ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.

రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ "వరసు" మూవీ కోసం 90 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు అని ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: