తాజాగా కియా అద్వానీ ఇక ఇంటా బయట వస్తున్న ఒత్తిడులు తట్టుకోలేక ఓ పోస్ట్ చేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఈ రహస్యాన్ని ఇక ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2న ప్రకటిస్తాను. వేచిచూడండి' అంటూ హింట్ ఇచ్చింది.
దీంతో కియా అద్వానీ తన ప్రేమ, పెళ్లి గురించే ఏదో బాంబు పేల్చబోతోందని.. సిద్ధార్థ్ తో ప్రేమ విషయం బయటపెట్టి ఈ బ్యూటీ పెళ్లికి రెడీ అయిపోతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీళ్లద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారని.. కియారానే అది అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతోందని తెలుస్తోంది.కియారా-సిద్ధార్థ్ లు బాలీవుడ్ లో పలు సినిమా ఫంక్షన్లకు, పలు ఈవెంట్లకు కలిసి వెళ్లడంతో వీరి ప్రేమ విషయం బయటపడింది. ప్రస్తుతం కియారా స్పందన చూస్తే ఖచ్చితంగా అది పెళ్లి గురించేనని అంటున్నారు. నిజమెంటో తెలియాలంటే డిసెంబర్ 2 వరకూ ఆగాల్సిందే.