ముఖ్యంగా ఈ సినిమాలో కార్తికేయ సరసన డీ జే టిల్లు లో హీరోయిన్ నేహశెట్టి నటిస్తోంది. ఇప్పటివరకు చూడని అతిపెద్ద గాలివార్త గురించి మనకు ఈ సినిమా చూపించబోతోంది. ఇకపోతే ప్రపంచం ఒక ముగింపుకి వచ్చేసిందని నమ్మే ఒక ఊరి చుట్టూ తిరిగే కథ ఇది.. 2012లో డిసెంబర్ 21న ఇలాగే ప్రపంచం అంతమవుతుందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దాని చుట్టూ సరదాగా సాగే కథే ఇది. అయితే ఈరోజు నేహా శెట్టి పుట్టిన రోజు కారణంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు దర్శకనిర్మాతలు.
ఇకపోతే నేహా శెట్టి ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాత్రతో ఆమె ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఫన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకేక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి తప్పకుండా తన సత్తా చాటుతుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.