
ఈ క్రమంలోనే వివాదాల తర్వాత మొదటిసారి కర్ణాటకలో తాను నటించిన వారసుడు సినిమా ప్రమోషన్స్ కోసం బయలుదేరింది రష్మిక. మరి అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఇకపోతే విజయ్ దళపతి హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ చిత్రం వారసుడు. ఇదే చిత్రాన్ని తమిళ్లో వారిసు పేరిట రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల వద్ద విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేయగా..ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా విషయంలో ఎన్నో వివాదాలు చుట్టుమట్టాయి. తెలుగు సినిమాలు అయిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు కూడా విడుదలవుతున్న నేపద్యంలో ఈ రెండు సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా తమిళ హీరోకి తెలుగులో ఎక్కువ థియేటర్ లు ఇవ్వడంతో సర్వత్రా వివాదాలకు దారితీస్తోంది. మరి ఎక్కువ థియేటర్లను సొంతం చేసుకున్న వారసుడు ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.