టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ ‘వాల్తేరు వీరయ్య’. యువ దర్శకుడు బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ఇక చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ మేకర్స్ చెబుతున్నారు.మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయిన మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఆర్‌కె బీచ్‌లో పెట్టడానికి మూవీ యూనిట్ మొదట ఆలోచన చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ ఈవెంట్ చేసుకోడానికి నిరాకరించిందని,ఇక దీంతో ఈ చిత్ర బృందం వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి ప్రీ రిలీజ్ వేదికను మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా  వార్తలు వినిపించాయి. అయితే ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి మరో వార్త బయటకి వచ్చింది.ఈ ఈవెంట్ ని ఫస్ట్ అనుకున్నట్లు ఆర్‌కె బీచ్‌లోనే నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది.


అయితే దీనిపై చిత్ర యూనిట్ అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేసిన మూవీ టీం.. వేదికను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. దీంతో మెగాఫ్యాన్స్ నిర్మాతలుపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పై క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.ఇక ఈ రోజు థియేటరికల్ ట్రైలర్ ని విడుదల చేస్తాం అని చెప్పిన మూవీ టీం. టైంని మరి కాసేపటిలో చెబుతాము అంటూ ప్రకటన చేశారు. ఇంకా ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. చిరంజీవి గ్యాంగ్‌స్టార్‌గా ఇంకా అలాగే జాలరుగా రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. జనవరి 13 వ తేదీ న ఈ మూవీ చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: