రష్మిక మందనా కిర్రాక్ పార్టీ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కానీ ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది

మొదటి సినిమాతోనే అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోస్ దృష్టిలో పడింది. స్టార్స్ కూడా ఆమె అందానికి , నటనకు ఫిదా అయ్యారు. స్టార్ హీరోస్ అయిన అల్లు అర్జున్,మహేష్ బాబు.. తమ సినిమాలలో అవకాశమిచ్చి మంచి విజయాలు సాధించారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను చేసింది . మరీ ముఖ్యంగా చెప్పాలంటే పుష్ప సినిమా చేసిన తర్వాత రష్మిక మందనకు ఏ రేంజ్ లో ఆఫర్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే . ఏకంగా బాలీవుడ్లో ఏడు బడా సినిమాలకు ఆమె సైన్ చేసింది . అంతెందుకు పుష్ప సినిమా తర్వాత ఇప్పటివరకు రష్మిక నుంచి హిట్ సినిమా లేదు అయినా కానీ ఆమె ఖాతాలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. పుష్ప తో ఆమెకు ఏ రేంజ్ లో స్టార్ డం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు .

కాగా ఎన్టీఆర్ 30సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినా ఈ సినిమా నుండి ఆమె ను తీసేసినట్లు సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది మిషన్ మజ్ను సినిమా ఫలితం చూసిన తర్వాత కొరటాల శివసినిమా నుండి రష్మికను డ్రాప్ చేయాలని చూస్తున్నాడట.ఈ మధ్యకాలంలో వరుస గా వివాదాలు లో చిక్కుకున్న రష్మిక ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తే సినిమాకి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని..

ఈ క్రమంలోనే సినిమా నుండి ఆమెను తీసేసినట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో రష్మిక మందనకు పెద్ద షాక్ తగిలింది.. ఇప్పటికే గుడ్ బాయ్ మరియు మిషన్ మజ్ఞు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి . ఈ క్రమంలోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకోవడం ఆమెకు నిజంగానే పెద్ద మైనస్ అని అంటున్నారు సినీ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: