మలయాళం సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా ఆయనకు కోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మోహన్ లాల్ పై ఏనుగు దంతాల కేసు ఉన్న సంగతి తెలిసిందే. గతకొంత కాలం నుంచి ఆయనను ఈ కేసు వెంటాడుతోంది.ఇక గతంలో మోహన్ లాల్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న సమయంలో రెండు ఏనుగు దంతాలను వారు గుర్తించడం జరిగింది. దాంతో ఆయన పై ఇక వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు అప్పుడు మోహన్‌ లాల్‌ కోర్టుకు సరైన వివరణ కూడా ఇచ్చారు.ఇంకా అలాగే అక్కడి ప్రభుత్వం కూడా ఆయనకు బాగా మద్దతుగా నిలిచింది. ఇక చట్ట ప్రకారమే చనిపోయిన ఏనుగు దంతాలను మోహన్ లాల్ తన ఇంట్లో అమర్చుకున్నారని సమాచారం తెలిపింది.


అయితే ప్రభుత్వ వైఖరి పై మేజిస్ట్రేట్‌ కోర్టు చాలా సీరియస్ అయ్యింది.ఇదే పని సామాన్యుల చేస్తే ఇలానే ఊరుకుంటారా అని ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది.ఈ క్రమంలో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం జరిగింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టింది కేరళ హైకోర్టు. ఇక మోహన్ లాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దాంతో ఇక మోహన్ లాల్ కు చుక్కెదురైంది.మోహన్ లాల్ జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే ఆయన చేసిన మన్యం పులి సినిమా కూడా తెలుగులో మంచి హిట్ కొట్టింది. దాంతో ఆయన సినిమాలు చాలా వరకు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: