పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మరియు తన సతీమణి స్నేహ రెడ్డి ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తీసుకున్నా కట్నం గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారు అని ఇటీవల ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన.. ఇందులోభాగంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీకి ఎప్పుడు తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.. 

ఆర్థికంగా ఎదిగేందుకు ఎప్పుడూ అల్లు అర్జున్ ప్రయత్నిస్తూనే ఉంటాడు.. ఇక ఆయనకే బోలెడంత ఆస్తి ఉంది.. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ..అంటూ చెప్పుకొచ్చాడు చంద్రశేఖర్. అనంతరం నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. నా స్నేహితులు ఎప్పుడూ ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు.. అక్కడికి వెళ్లిన సమయంలో అక్కడి నార్త్ ఇండియా హోటల్స్ లో మరియు ఇతర దేశంలో అల్లు అర్జున్ సినిమాల సాంగ్స్ను ప్లే చేస్తూ ఉంటారు.. అంతేకాదు ఒకసారి నా భార్య జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళింది.. ఆ సమయంలో తను అల్లు అర్జున్ అత్తగారు అని తెలుసుకున్న నార్త్ ఆడియన్స్ ఆమెతో తెగ సెల్ఫీలు దిగారు..

అక్కడ కూడా ఆయన క్రేజ్ అలా ఉంది అంటూ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పాడు చంద్రశేఖర్. అనంతరం చిరంజీవి గురించి మాట్లాడుతూ.. నాకు చిరంజీవికి మంచి అనుబంధం ఉందని.. ఆయన నన్ను ఎప్పుడూ బాగా పలకరిస్తారు అని.. నేను ఆయనకి పెద్ద వీరాభిమాని అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు చంద్రశేఖర్. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ కి హైదరాబాదులో విద్యాసంస్థలు ఉన్నాయి వాటిని చూసుకునే పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటాడు చంద్రశేఖర్ రెడ్డి. ఇక అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి ఇద్దరూ 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హతగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: