బాలీవుడ్ హాట్ నటి పూనమ్ పాండే గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవెర్సీలతో దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా 2011వ సంవత్సరంలో వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధిస్తే..టీమిండియా క్రికెటర్ల ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలుచుంటా అంటూ హాట్ కామెంట్స్ చేయడంతో అప్పట్లో ఆమె దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.అయితే ఆ తర్వాత అలా ఏం జరగలేదు. అలా జరిగితే ఆమె పరిస్థితి ఇంకోలా ఉండేది. దానికి భయపడి చెయ్యలేదు. ఇక ఈరోజు పూనమ్ పాండే 32వ జన్మదినం జరుపుకుంటోంది. ఆమె పుట్టినరోజుకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది.ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో ప్రపంచ కప్ వివాదం గురించి పూనమ్ మాట్లాడింది.2011 వ సంవత్సరంలో ఇండియాలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా ఇండియా ప్రపంచకప్ గెలిస్తే తన బట్టలు విప్పేస్తానని చేసిన ప్రకటనతో పూనమ్ పాండే అప్పుడు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.


ఆ తర్వాత కూడా, పూనమ్ పాండే తన బోల్డ్ లుక్ ఇంకా న్యూడ్ ఫోటోషూట్ కారణంగా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.ఇక రేడియో మిర్చితో పూనమ్ పాండే మాట్లాడుతూ, 'నాకు అప్పుడు 18 సంవత్సరాలు. అప్పుడు జీవితంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాను? అప్పుడు ఏదైనా పెద్ద పని చేద్దామనుకున్నాను. ఇక వరల్డ్ కప్ జరుగుతోంది. నేనేం చేసినా కూడా ప్రపంచం మొత్తం చూస్తుంది.  క్రికెట్ గురించి నాకు అసలు తెలియదు. క్రికెటర్ల పేరు కూడా తెలియదు. కానీ నేను మాత్రం ఏదో ఒకటి చేయాలి. స్టేట్ మెంట్ ఇద్దాం అని ఫిక్స్ అయిపోయా.నిజానికి ఇది పెద్ద స్టేట్ మెంట్, ఇండియా మొత్తం షేక్ అవుతుంది, ఆ స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత ఇండియా కూడా గెలిచింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.కానీ ఇప్పుడు ప్రతిరోజూ కూడా ఇంట్లో నరకం చూస్తున్నారు. అమ్మ బాగా కొడుతోంది. నాన్న కూడా అరుస్తున్నారంటూ తన బాధను వెల్లగక్కింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ.ఇక తన భర్త కూడా టార్చర్ చేసేవాడని పూనమ్ అప్పుడు వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: