ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ కూడ ఒకరు. పలు చిత్రాలలో నటించిన తర్వాత ఫలక్నామా దాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమాతో తన మాస్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నారు.. ఇక తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక సపరేటు బ్యాక్ గ్రౌండ్ ని ఏర్పరచుకున్నారు విశ్వక్.. అలా తన సినిమాలో ఆడియో ఫంక్షన్ కి స్టార్ హీరోలను గెస్ట్ గా పిలిపించే స్థాయికి ఎదిగారు విశ్వక్.

ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఒకటి.. ఇందులో హీరోగా విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించారు కానీ స్వయంగా కూడా ఈ సినిమాకి దర్శకత్వం వహించడం జరిగింది.. హీరోయిన్గా నివేదా పీతురాజు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టింది దర్శకుడుగా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారు విశ్వక్.. ఇప్పటివరకు థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్నైనా ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో స్ట్రిమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది.


ప్రముఖ తెలుగు ఓటిటి ఆహా లో ఈ సినిమా ఏప్రిల్ 14 నుంచి స్ట్రిమ్మింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహ నే అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా విశ్వక్ సేన్ బ్యానర్ పైనే కరాటే రాజు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమాలో రంగస్థలం మహేష్ ,రావు రమేష్ ,రోహిణి తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ముఖ్యంగా డబ్బు కోసం ఎంతటి దారుణమైన పొడగట్టేటువంటి సంజయ్ రుద్ర అనే పాత్రలో నటించడం జరిగింది. ప్రస్తుతం విశ్వక్  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒక చిత్రంలో నటించబోతున్నట్లు శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్తో తెలియజేయడం జరిగింది. ఇలాంటి బడ బ్యానర్ పైన నటించడంతో విశ్వక్భి అభిమానులు తన రేంజ్ ని రోజురోజుకు పెంచుకుంటున్నారు అంటు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: