తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్న యువ హీరో లలో నాగ శౌర్య ఒకరు  . ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమా  లలో నటించి కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరో గా కెరీర్  ను కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా నాగ శౌర్య "ఫలానా అబ్బాయి పాలానా అమ్మాయి" అనే రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు . 

ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... మాళవిక నాయర్ ఈ సినిమాలో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.

 ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా మే 5 వ తేదీ నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతుంది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: