గత కొంతకాలం నుంచి టాలీవుడ్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో హవా నడిపిస్తూ ఉన్నారు. భారీ రేంజ్ హిట్లు సాధిస్తూ దూసుకుపోతున్నారు అని చెప్పాలి. దీంతో మొన్నటి వరకు టాలీవుడ్లో అడుగుపెట్టడానికి వెనుక ముందు ఆలోచించినా బాలీవుడ్ భామలు ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎప్పుడు చాన్స్ వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్నవారు సైతం ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల తరఫున ఛాన్సులు వస్తే రెమ్యూనరేషన్ తక్కువ అయినా పర్వాలేదు నటించేందుకు సిద్ధమవుతున్నారు.



 ఈ క్రమంలోనే ఇప్పటికే తారక్ సరసన జాన్వికపూర్ ఒక సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ అటు టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయం కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఒక మూవీ చేయబోతున్నాడు. ప్రభాస్ సలార్ మూవీ అనంతరం ఇక ఇది స్టార్ట్ కానుంది అని చెప్పాలి.



 ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్టు కోసం మరో బాలీవుడ్ భామను ఎంపీగా చేశారట. ఇందులో తారక్  కు జోడిగా శ్రద్ధా కపూర్ కనిపించబోతుందట. అయితే గతంలో ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమాలో శ్రద్ధ కపూర్ నటించింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక నాలుగేళ్ల తర్వాత మరోసారి తారక్ సరసన నటించి.. తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది శ్రద్ధ కపూర్. అయితే శ్రద్ధా కపూర్ కంటే ముందు దీపికా పదుకొనేను తీసుకోవాలనిఅనుకున్నారట మేకర్స్. కానీ ఆమె బిజీగా ఉండడంతో చివరికి ఈ చాన్స్ శ్రద్ధాను వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: