టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత, సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన మూవీ ‘శాకుంతలం’.కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా ఈ శాకుంతలం సినిమా 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాలో సమంత ‘శకుంతలా దేవి’గా నటించగా, దేవ్ మోహన్ ‘దుష్యంత మహారాజు’గా నటించాడు.ఇక వీరు ఇద్దరికీ పుట్టిన ‘భరతుడి’గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటించింది. ఫాంటసీ డ్రామాగా అనౌన్స్మెంట్ తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన ఈ సినిమా 80 కోట్ల భారి బడ్జట్ తో రూపొందింది. కేవలం సమంత మాత్రమే సేవియర్ గా, ఆమె మార్కెట్ పైనే డిపెండ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకి వచ్చింది శాకుంతలం సినిమా. హ్యూజ్ థియేట్రికల్ బిజినెస్ సొంతం చేసుకున్న శాకుంతలం సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే చాలా దారుణమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈవెనింగ్ షోస్ నుంచి థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించడం కూడా తగ్గింది.


మౌత్ టాక్ నెగటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో మూడో రోజుకే శాకుంతలం సినిమా బాక్సాఫీస్ రన్ కి  ఎండ్ కార్డ్ పడిపోయింది.దీంతో సినిమాని కొన్న ప్రతి ఒక్కరికీ భారి నష్టాలని మిగిలాయి. సమంత స్టార్ ఇమేజ్ కూడా శాకుంతలం సినిమాని నష్టాల బారి నుంచి బయట పడేయలేకపోయింది. దిల్ రాజు అంతటి పెద్ద ప్రొడ్యూసర్, తన 25 ఏళ్ల కెరీర్ లో శాకుంతలం సినిమా అంత షాక్ ఇచ్చిన సినిమా ఇంకొకటి లేదని చెప్పాడు అంటే శాకుంతలం సినిమా ఎలాంటి షాకింగ్ రిజల్ట్ ని ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.ఈ సినిమా చాలా దారుణంగా బడ్జెట్ లో 5% మాత్రమే వసూలు చేసింది. అంటే 80 కోట్లు పెట్టి తీస్తే కేవలం  4 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి ఈ సంవత్సరం బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది.ఇక ఫస్ట్ మండేకే థియేట్రికల్ రన్ ని ఎండ్ కార్డ్ పడడంతో, నెల కూడా తిరగకుండానే శాకుంతలం సినిమా సైలెంట్ గా ఒటీటీలో విడుదల అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ లాంగ్వేజస్ లో శాకుంతలం మూవీ స్ట్రీమ్ అవుతోంది. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఒటీటీలో అయినా శాకుంతలం సినిమాని చూస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: