రెండు నెలల ముందు అసలు రాష్ట్రంలో రాజకీయపరిస్తితులేంటి, ఎవరు ఏ సినిమా చేస్తున్నారు అని తెలుసుకుందామని టీవీలో న్యూస్ ఛానెల్ పెడితే బిగ్ బాస్ నుండి ఊడిపడ్డ కత్తి మహేష్ మాత్రమే కనిపించేవాడు. కత్తి మరియు పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం సమసిపోవడంతో టీఆర్పీ రేటింగ్స్ రాక ఛానెల్స్ మూగబోయాయి. ఇప్పుడు తాజాగా శ్రీ రెడ్డి, కత్తి ని రీప్లేస్ చేసింది. బోల్డ్ గా మాట్లాడేస్తూ ఉండటం న్యూస్ ఛానెళ్లకు వరం అవడంతో ఆమె ఇంటర్వ్యూ కోసం పలు ఛానెళ్లు ఎగబడుతున్నాయి.


ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పక్క పంచుకోవాల్సిందే, ఇప్పుడు ఉన్న టాప్ హీరోయిన్లందరూ దర్శకుల, నిర్మాతల వద్ద తామనితాము అర్పించుకున్నవారే అంటూ ఆమె సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈమె చెప్పిన మాటలను ఒక ఛానెల్ నిజమని నిరూపించింది. ఏకంగా ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి మూవీ కోఆర్డినేటర్ అయిన చాంద్ బాషా లతో పాటు ఒక ప్రముఖ డైరెక్టర్, ఒక బడా నిర్మాత కొడుకుల వెకిలి చేష్టలను బయటపెట్టింది.


ఈ కార్యక్రమంలో చర్చిండానికి ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, నిర్మాతల మండలి మెంబర్ అయిన ప్రసన్న కుమార్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన విస్తుపోయే ఒక నిజాన్ని చెప్పాడు. ఇప్పుడు ఒక ప్రముఖ హీరోయిన్  గా చలామణి అవుతున్న ఒక నటి తన  కెరీర్ మొదట్లో ఒక హీరో సినిమాలో నటించడానికి ఆ సినిమా డైరెక్టరుతో సైతం పక్కపంచుకోవడానికి సిద్ధమని ఆమె స్వయానా ఆమె మేనేజర్ ద్వారా ఆ డైరెక్టరుకు కబురు పంపిందని చెప్పాడు. అయితే ఆమె పేరు చెప్పడానికి నిరాకరించిన ఆయన సినిమా అవకాశాలు లేక విసిగిపోయి ఆమె అలా చేసి ఉండవచ్చని ఆయన సమర్ధించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: