టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కెరీర్ 25 సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసిలో నటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు పవన్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ కావడంతో, మూడో సినిమా గా రాబోతున్న అజ్ఞాతవాసి తప్పకుండా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాపై విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అప్పట్లో అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గా నిలిచి దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. అనంతరం పవన్ కళ్యాణ్ తన సినీ జీవితానికి సెలవు ప్రకటించి, 

తాను నెలకొల్పిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం అయ్యారు. అంతేకాక ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తరఫున గాజువాక మరియు భీమవరం ప్రాంతాల్లో పవన్ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక అక్కడి నుండి తన పార్టీని మరింతగా ప్రజల్లో కి తీసుకెళ్లాలని భావించిన పవన్, ఆ విధంగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు నడుస్తున్నారు. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ గారు తమ కోసం ఒక సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. కాగా ఎట్టకేలకు నిన్న పవన్ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా పింక్ మూవీ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటన రావడం జరిగింది. అయితే మధ్యలో పలువురు దర్శకుల నుండి కథలు విన్నప్పటికీ, అవేవి ఆయనకు పెద్దగా నచ్చలేదని, 

అయితే పింక్ సినిమా స్టోరీ బాగా నచ్చడంతో ఆయన రీమేక్ చేయడానికి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ విధంగా పవన్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనేది ఆయన ఫ్యాన్స్ కు ఎంతో సంతోషం కలిగించే విషయమే అయినప్పటికీ, మరొక వార్త మాత్రం వారి గుండె బద్దలు చేయక మానదు. అదేమిటంటే, పవన్ కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తారని, దాని తర్వాత ఇకపై ఆయన సినిమాల్లో నటించేది లేదని కూడా గట్టిగా వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇకపై పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే తన జీవితాన్ని గడపటానికి నిర్ణయించుకున్నారని, కాగా ఈ సినిమా కేవలం అభిమానుల కోసమే చేస్తున్నారని అంటున్నారు అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: