తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనదేశంలోనే అతి పెద్దదైన బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అగ్ర నటులైన ముగ్గురు ఖాన్లు మరియు బిగ్ బి అమితాబ్ సహా అందరూ కూడా రజిని క్రేజ్ ముందు మేము నిలబడలేము అని చెప్పిన సందర్బాలు కొన్ని ఉన్నాయి. ఇకపోతే ఇటీవల 2.0, పేట సినిమాలతో రెండు వరుస హిట్స్ అందుకున్న సూపర్ స్టార్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలానే కొద్దిరోజుల క్రితం తాను కూడా అతి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంచనలన ప్రకటన కూడా చేసారు. అయితే అప్పటినుండి కూడా ఆయన పార్టీ అంతర్గత కార్యక్రమాలు ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. 

ఇకపోతే అతి త్వరలో తన పార్టీ పేరుని అలానే సింల్ ని ప్రకటించేలా రజిని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే నేడు తమిళ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రజిని, తనకు రాజకీయాల ద్వారా వీలైనంత ఎక్కువగా ప్రజాసేవ చేయాలనే ఆశ ఎప్పటినుండో ఉందని, అయితే అది ఇన్నేళ్లకు నెరవేరబోతోందని అన్నారు. కొన్ని పార్టీలు తనకు ఆహ్వానం పలికి పెద్ద పదవులు ఇస్తామని కూడా ఆఫర్ చేసినప్పటికీ, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక సినిమాల విషయమై రజిని మాట్లాడుతూ, ప్రస్తుతం వరుస విజయాలు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, 

కాగా తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించేవరకు సినిమాలు మాత్రం చేస్తూనే ఉంటానని అన్నారు రజిని. ఇక ఆయన మాటలను బట్టి రజిని మరొక నాలుగు సినిమాల తరువాత తన పార్టీ ప్రకటనతో పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అంటున్నారు కోలీవుడ్ విశ్లేషకులు. దానిని బట్టి ఇప్పుడు చేస్తున్న దర్బార్ తో పాటు అతి త్వరలో శివ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారట. అంటే దాని తరువాత మరొక్క రెండు సినిమాల తరువాత రజిని, వెండితెరపై కనపడే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: