టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమా మంచి సక్సెస్ సాధించి, వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన ఆయనకు మంచి ఊరటనిచ్చింది అనే చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ తమ గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను మంచి మాస్, యాక్షన్ మూవీ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. గతంలో బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య2 ని మించేలా ఈ సినిమా రూపొందుతోందని టాక్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగె ఈ కథలో బన్నీ తో పాటు రష్మిక కూడా పక్కా మాస్ పాత్రలో నటిస్తోందట. ఇందుకోసం హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా తమ మేకోవర్ లో కొంత కొత్త చేంజెస్ చేసినట్లు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ని పెట్టాలని భావిస్తోందట సినిమా యూనిట్. అయితే ఈ టైటిల్ పెట్టడానికి ఒక కారణం కూడా ఉందట, అదేమిటంటే, ఈ సినిమా చాలా వరకు శేషాచలం అడవుల నేపథ్యంలో సాగుతుందని, అలానే సినిమాలో హీరో పేరు కూడా శేషు అని అంటున్నారు. 

 

అదీకాక గతంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా టైటిల్ కూడా మంచి క్యాచీగా ఉండడంతో, అదే తరహాలో ఈ సినిమాలో శేషాచలం అనే పేరు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట. అయితే దీనితో పాటు మరొక మూడు టైటిల్స్ కూడా యూనిట్ పరిశీలనలో ఉన్నాయని, కానీ ఎక్కువ శాతం మాత్రం శేషాచలం అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కాగా ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: