మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్ల క్రితం వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రలహరి సినిమా మంచి సక్సెస్ సాధించి తేజ్ కు కెరీర్ పరంగా బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ఇక దాని అనంతరం మారుతీ దర్శకత్వంలో తేజ్ నటించిన ప్రతిరోజు పండగే సినిమా, గత డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టడంతో ఆయన కెరీర్ లోమరొక విజయం దక్కింది. ఇక ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న తేజ్, అతి త్వరలో దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

వెన్నెల సినిమాతో దర్శకుడిగా తన మూవీ కెరీర్ ని ప్రారంభించి మంచి సక్సెస్ అందుకున్న దేవా కట్టా, ఆ తరువాత సాయికుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రస్థానంతో సూపర్ హిట్ కొట్టాడు. ఆపై ఆయన నాగచైతన్యతో తీసిన ఆటో నగర్ సూర్య కూడా మంచి విజయం అందుకుని దర్శకుడిగా దేవాకట్టాకు మంచి పేరు తెచ్చింది. అయితే ఆ సక్సెస్ లు ఆయనకు ఆశించిన రేంజ్ లో అవకాశాలను అందించలేకపోయాయి. ఇక ఇటీవల హిందీలో సంజయ్ దత్ హీరోగా ఆయన ప్రస్థానం సినిమా రీమేక్ కి కూడా దర్శకత్వం వచించడం జరిగింది. అయితే అది యావరేజ్ విజయాన్ని అందుకుంది. 

 

ఇకపోతే ఇటీవల సాయి ధరమ్ తేజ్ ను కలిసిన దేవా, తన వద్ద ఉన్న ఒక మంచి స్క్రిప్ట్ ని వినిపించడం జరిగిందని టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఆ స్క్రిప్ట్ సాయి తేజ్ కు విపరీతంగా నచ్చడంతో ఆయన కూడా అతి త్వరలో ఆ సినిమా మొదలెట్టేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అంతగా పేరులేని దేవకట్టా సినిమా ఒప్పుకుని సాయి తేజ్ కొంత రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా ఓకే అయిన విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: