‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్స్ తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక మూవీని చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 'అరవింద సమేత వీర రాఘవ' తరువాత మళ్ళీ రిపీట్ కాబోతున్న ఈ మూవీ ప్రాజెక్ట్ ను హారిక హాసిని బ్యానర్ లో నిర్మాణం జరగబోతోంది.  


కరోనా సమస్యలతో ఇంటికే పరిమితం అయిపోయిన త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతూ ఈ మూవీలో నటించే నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకునే ఈ మూవీలో  అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభంకాబోతోంది.   


ఈనేపధ్యంలో ఈ మూవీకి సంబంధించి ఇప్పడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి రాజకీయ నేపపధ్యం ఉన్న కథతో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్తమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణం జరుపుకొబోతున్న ఈ మూవీలో  ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్‌‌‌గా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. 


ప్రస్తుతం త్రివిక్రమ్ కు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ గా మారిన పరిస్థితులలో మరొక కీలక మైన హీరోయిన్ పాత్రకు జాన్వి కాపూర్ ను ఒప్పిచగలిగితే ఈ మూవీ మార్కెట్ ఊహించని స్థాయిలో జరుగుతుంది అన్న అలోచనలు త్రివిక్రమ్ కు రావడంతో ఈ విషయమై త్రివిక్రమ్ జాన్వీ కపూర్ తండ్రి బోనీ కప్పోర్ తో చర్చలు చేస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే కరణ్ జోహార్ స్వయంగా చెప్పిన విజయ్ వరకొండతో పూరి జగన్నాథ్ మూవీలో నటించడానికి ఒప్పుకొని జాన్వీ త్రివిక్రమ్ రాయబారాలకు స్పందిస్తుందా అన్నదే సమాధానం లేని ప్రశ్న. వాస్తవానికి జాన్వీకి తన తల్లి శ్రీదేవి లా దక్షినాది సినిమాలలో నటించాలి అని కోరిక ఉన్నా అది అత్యంత భారీ సినిమా అయితేనే నటిస్తాను అని అంటున్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: